Rapid TV - Andhra Pradesh / Anakapally : రెండు రోజుల పాటు జరుగు సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు చోడవరం నియోజకవర్గ కేంద్రలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎం వి ఎస్ శర్మ పాల్గొని తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా కొలువుతీరిన ప్రభుత్వానికి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించవలసిన అవసరం ఉందని అన్నారు అనకాపల్లి జిల్లా, చోడవరం ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యం గా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ, రైతుల బకాయిలు , రోడ్లు, శిధిలమైన కల్వర్టులు, బ్రిడ్జి వంటి అనేక మౌలిక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి పాలవర్గాలు క్రుషిచేయాలని కోరారు నూతనంగా ఎర్పడ్డ ప్రభుత్వం పై ప్రజలు అనేక అశలు పెట్టుకున్నారని వాటికి అనుగుణంగా పాలన అందించాలని కోరారు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే ప్రజా పోరాటాలు నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శిక్షణ తరగతులకు పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు డి. వెంకన్న, జి. కోటేశ్వరరావు, వి వి శ్రీనివాసరావు, ఆర్.శంకరరావు, ఎస్. వి నాయుడు, నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
Admin
Rapid TV