Rapid TV - Andhra Pradesh / Anakapally : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం గా చేయడానికి సిద్ధంగా ఉన్నారని అనకాపల్లి వైఎస్ఆర్సిపి అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అన్నారు. అనకాపల్లి పట్టణంలోని కోట్నివీధి కళ్యాణ మండపంలో జీవీఎంసీ 84 వ వార్డు వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు, 84 వ వార్డు వైసిపి ఇన్చార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన 20 మంది యువకులు కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వీరిని మలసాల భరత్ కుమార్ పార్టీ కండువా వేసి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు, నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేష్, మలసాల కుమార్ రాజా, అప్పికొండ రవిశంకర్, కెపి సతీష్, గొల్లవిల్లి జానకిరామ్, పన్నీర్ మహేష్ గాది మాధురి నాయుడు సురేష్ ఈగల మహేష్, కోరుకొండ అప్పలసూరి,ఉగ్గిన అప్పారావు, ఉమ్మిన పైడిరాజు, పిల్లల శివ అప్పారావు, మరియు 84 వ వార్డు వైసిపి నాయకులు ,విలీన గ్రామాల వైసిపి నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు వైసిపి అభిమానులు పాల్గొన్నారు,
Admin
Rapid TV