Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం గుడివాడ పంచాయతీ పరిధి మట్టవానిపాలెం గ్రామ శివారులో పేకాట శిబిరంపై గురువారం రావికమతం పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మటవారిపాలెం గ్రామ శివారులలో అటవీ ప్రాంతానికి సమీపంలో ఎనిమిది మంది పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు వారి వద్ద నుంచి 52 పేక ముక్కలను 56,000 నగదు స్వాధీన పరుచుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Admin
Rapid TV