Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం: మండలం లోని గర్ణికం గ్రామ సమీపంలో ని తిరుమల ఫంక్షన్ హాల్ వద్ద గత రాత్రి మేడివాడ గ్రామానికి చెందిన కొలిపాక పవన్ కుమార్ హత్య గావింప బడ్డాడు. ఈ విషయమై కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు కదనం మేరకు మేడివాడ గ్రామానికి చెందిన కులిపాక త్రిమూర్తులు అనే వ్యక్తి తన కుమారుడు పవన్ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఫోన్ ద్వారా తెలియజేశారని వెంటనే సంఘటన స్థలానికి రాత్రి ఒంటి గంట సమయంలో వెళ్ళామని దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఫోరేసీక్ బృందం పరిశీలన అనంతరం పోస్టుమార్టంకు తరలించామని తెలిపారు. మృతుడు తండ్రి త్రిమూర్తులు విలేకరు లతో మాట్లాడుతూ నాకుమారుడు ని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గత రాత్రి సెల్ ఫోన్ కొనుక్కుంటానానని కొంత నగదు ఇచ్చానని తెలిపారు. మృత దేహం వద్ద కొంత నగదు కూడా పోలీస్ లు స్వాదీన పర్చు కున్నారు.
Admin
Rapid TV