Rapid TV - Andhra Pradesh / Anakapally : ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై దాడిని ఖండిస్తూ అనకాపల్లి జిల్లా చోడవరంలో జర్నలిస్టులు ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాప్తాడు సిద్ధం సభ వేదికగా ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడికి పాల్పడిన వైసిపి నాయకుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునేలా ఈ ప్రభుత్వాలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మడి పడ్డారు. ఈ ర్యాలీలో ఏపీడబ్ల్యూజే యూనియన్ సభ్యులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు సీనియర్ జర్నలిస్టులు డి వి యం నాయుడు ఆంధ్రప్రభ జోజి ఆంధ్రజ్యోతి, రామకోటి, రాము, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV