Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకులోయ నియోజకవర్గ గిరిజన గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న అరకులోయ అసెంబ్లీ టిడిపి రెబల్ అభ్యర్థి సివేరి అబ్రహం కు ఆయా గ్రామాల్లోని గిరిజనలు ఘన స్వాగతం పలుకుతున్నారు. దీనిలో భాగంగా శనివారం మండలం లోని సిరిగం పంచాయతీ పరిధిలోని దిబ్బవలస, లంతంపాడు, సిరగాం తదితర గ్రామాల్లో పర్యటించిన అబ్రహం కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఆయా గ్రామాల గిరిజను లు మేమున్నామంటూ ధైర్యం చెప్పినట్టు ఈ సందర్భంగా అబ్రహం విలేకరులకు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ మరికొద్ది నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో అరకు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ స్థానాలు హాట్ టాపిక్ గా మారాయి.
Reporter
Rapid TV