Sunday, 13 September 2026 03:21:18 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గణపతిమట్టి విగ్రహాలు పంపిణీ

Date : 12 September 2026 10:11 PM Views : 30

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి అనకాపల్లి : పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఆర్యవైశ్య మహాసభ అనకాపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో గణపతి మట్టి విగ్రహాలు ఉచితముగా పంపిణీ చేశారు. 2000 గణపతి మట్టి విగ్రహాలు చిన్న వీధి రామాలయం వద్ద, కన్యకా పరమేశ్వరి ఆలయం జంక్షన్ వద్ద, అనకాపల్లి రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి వద్ద శనివారం విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ యలమర్తి నర్సింగరావు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో గణపతి మట్టి విగ్రహాలు పంపిణీ చేశామని అన్నారు. వివిధ రకాల రంగులు వాడిన విగ్రహాలను నదులలో కలపడం వల్ల నదులలోని నీరు కలుషితమై నీటిలో ఉన్న ప్రాణులు ఉనికికే ప్రమాదం కలుగుతుందని, వ్యవసాయానికి ప్రమాదం కలుగుతుందని అన్నారు ఈ రంగుల వలన సమాజంలో కలుషితం పెరిగి ప్రజలకు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. మానవాళి ఆరోగ్యం, సుఖం కోసం రాబోయే తరాలు వారికి స్వచ్ఛమైన గాలి భూమి నీరు అందించాలని ఉద్దేశంతో వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోయ కార్యదర్శి తమ్మన సుబ్రమణ్య గుప్త, కోశాధికారి గుండా రమేష్ గుప్త, పుట్టా మోహన్ రావు ( జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్), కొట్టాడ గణ ( మాడుగుల మండల ప్రెసిడెంట్), మీడియా చైర్మన్ పూసర్ల రాజా, జిల్లా హానరబుల్ అడ్వైసర్ నుదురుపాటి తాతాజీ, జిల్లా జాయింట్ సెక్రటరీ బండారు వీరవతారం, జిల్లా సేవాదళ్ జాయింట్ సెక్రటరీ ఉడా రమేష్, జిల్లా పి ఆర్ ఓ నేతి నాగ వెంకట వర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి అయ్యప్ప, అనకాపల్లి మండల ఆర్య వైశ్య ప్రెసిడెంట్ అర్రెప్పు కాశన్న, సెక్రటరీ కొల్లూరు కిషోర్, మండల ఈ సి మెంబర్ నారాయణ, జిల్లా ఈ సి మెంబర్ ఉద్దగిరి గోవింద కృష్ణ, మండల సేవాదళ్ ప్రెసిడెంట్ కె.వి.సత్యనారాయణ మరియు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :