Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి:: ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ కార్పోరేషన్ మరియు శ్రీ శక్తి మెడికల్స్ ఆధ్వర్యంలో శనివారం బి ఆర్ టి కాలని అనకాపల్లి లో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును, సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షా కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ సమాజంలో ఫార్మసిస్ట్ యొక్క పాత్ర అత్యంత కీలకమని, ఫార్మసిస్టుల వలన కరోనాని జయించగలగామని మెడికల్ రంగంలో వీరి యొక్క పాత్రను ఎంత అభినందించినా తక్కువే అన్నారు. ఇటువంటి మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి రత్నాల ప్రభాకర్ రావు గారిని ఈ సందర్భంగా అభినందించారు. సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం మరియు రాజా ఆప్టికల్ అండ్ కంటి ఆసుపత్రి అనకాపల్లి వారి సహకారంతో ఉచితముగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్న పూసర్ల రాజాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 200 మందికి కళ్ళు తనిఖీలు చేయించుకోగా, 63 మంది సర్జరీలకు ఎంపికయ్యారు వీరికి శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రి విశాఖపట్నంలో సర్జరీలు చేయిస్తామని సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ అధినేత పూసర్ల రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫార్మసిస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Rapid TV