Wednesday, 29 July 2026 12:29:03 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

మెడికల్ రంగంలో ఫార్మాసిస్ట్ సేవలు అమోఘం :: దాడి రత్నాకర్

Date : 02 November 2024 11:52 AM Views : 333

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి:: ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ కార్పోరేషన్ మరియు శ్రీ శక్తి మెడికల్స్ ఆధ్వర్యంలో శనివారం బి ఆర్ టి కాలని అనకాపల్లి లో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును, సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షా కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ సమాజంలో ఫార్మసిస్ట్ యొక్క పాత్ర అత్యంత కీలకమని, ఫార్మసిస్టుల వలన కరోనాని జయించగలగామని మెడికల్ రంగంలో వీరి యొక్క పాత్రను ఎంత అభినందించినా తక్కువే అన్నారు. ఇటువంటి మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి రత్నాల ప్రభాకర్ రావు గారిని ఈ సందర్భంగా అభినందించారు. సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం మరియు రాజా ఆప్టికల్ అండ్ కంటి ఆసుపత్రి అనకాపల్లి వారి సహకారంతో ఉచితముగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్న పూసర్ల రాజాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 200 మందికి కళ్ళు తనిఖీలు చేయించుకోగా, 63 మంది సర్జరీలకు ఎంపికయ్యారు వీరికి శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రి విశాఖపట్నంలో సర్జరీలు చేయిస్తామని సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ అధినేత పూసర్ల రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫార్మసిస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :