Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ఎస్ ఈ జెడ్ కాలనీ దిబ్బపాలెం పంచాయతీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ భారీ జన సంద్రోహం మధ్య ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు ఉమ్మడి విశాఖ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవాని భాస్కర్ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ రాజాన సన్యాసినాయుడు హాజరయ్యారు.21 శివారు గ్రామాలతో కలిపిన దిబ్బపాలెం పంచాయతీ వ్యాప్తంగా ప్రచార రథంపై ప్రతి గ్రామం తిరుగుతూ ఆయా గ్రామాలలోని సమస్యలను తెలుసుకున్నారు. ప్రచారం అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలలో గాజు గ్లాసు కమలం పువ్వు గుర్తులపై ఓట్లు వేసి మమ్ములను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ ఈ జడ్ కాలనీ పూర్తిగా అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ముఖ్య నాయకులు శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు*
Reporter
Rapid TV