Rapid TV - Andhra Pradesh / Anakapally : పత్రికా ప్రకటన *నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ* *జిల్లా కలెక్టరు విజయ క్రిష్ణణ్* అనకాపల్లి, అక్టోబరు 21: జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషను జారీ చేసినట్లు జిల్లా కలెక్టరు విజయ క్రిష్ణణ్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరు ఛాంబరులో నిర్వహించిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లాకలెక్టరు ఎన్నికల నోటిఫికేషను వివరాలు తెలియజేసారు. జిల్లాలో ఒక మేజరు, మూడు మీడియం,ఒక మైనరు నీటి ప్రోజెక్టు సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని సాగునీటి వనరుల కింద ఉన్నటువంటి సాగునీటి సంఘాలకు అక్టోబరు 21 నుంచి నవంబరు 29వ తేదీ వరకు వివిధ దశలలో ఎన్నికలు నిర్వహించుటకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. జిల్లాలో పెద్దతరహా నీటిపారుదల వనరులు కింద తాండవ జలాశయం వస్తుందని తెలిపారు. ప్రోజెక్టు కమిటీలు 4, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు 3, నీటి వినియోగ దారుల సంఘాలు 303 ఉన్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు. ఈ రోజునుండి ఓటరు లిస్టులను శుద్దీకరణ చేయడం జరుగుతుందని, ఇంతవరకు ఎన్నికలు జరుగని పెద్దేరు జలాశయానికి కొత్తగా ఓటరు లిస్టు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఇతర శాఖల నుండి 668 గెజిటెడ్ అధికారులను పోలింగు అధికారులుగా, 1530 మంది పోలింగుసిబ్బందిని నియమించడంజరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎ. త్రినాధన్, డిఇ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.
Admin
Rapid TV