Rapid TV - Andhra Pradesh / Anakapally : *నేడు ఎన్నికల ప్రచారం కొనసాగింపులో భాగంగా అచ్యుతాపురం మండలం గొర్లె ధర్మవరం, మడుతూరు గ్రామాలలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఉమ్మడి విశాఖ మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవాని భాస్కర్, నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ రాజాన సన్యాసినాయుడు ఆయా గ్రామాలలో పర్యటించారు.ఆ యొక్క గ్రామాలలోని ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నటువంటి మహిళల దగ్గరకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు చేకూరబోయేటటువంటి లబ్ధిని వివరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలలో చేసినటువంటి దౌర్జన్యాలను మహిళలకు తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో మహిళలందరూ మార్పు కోరుకున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Rapid TV