Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : నర్సీపట్నంలోని ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ, యంత్ర పునఃప్రతిష్ఠ మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, మండప ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు పూర్ణకుంభంతో స్పీకర్ దంపతులకు స్వాగతం పలికారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ఆధ్వర్యంలో మంగళవారం నుండి గురువారం వరకు పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరగనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Reporter
Rapid TV