Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : అనకాపల్లి జిల్లా : 2024 సార్వత్రిక ఎన్నికల్లో 43,767 ఓట్ల మెజార్టీ తో గెలుపొందిన పాయకరావుపేట కూటమి టి.డి.పి అభ్యర్థి వంగలపూడి అనిత ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. పాయకరావుపేట వై.సి.పి అభ్యర్థి కంబాల జోగులు పై గెలుపొందిన అనిత అనకాపల్లి కౌంటింగ్ సెంటర్ నుండి నేరుగా ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం ఉపమాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం నక్కపల్లి క్రిష్ టౌన్ షిప్ లో ఉన్న తన స్వగృహం నకు ఊరేగింపుగా విచ్చేశారు. అనిత స్వగృహంకు చేరుకున్న కూటమి నాయకులు ,కార్యకర్తలకు ఆమె అభివాదం చేశారు. తన గెలుపుకు కృషి చేసిన వారందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు ఇచ్జి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మందుగుండు సామాగ్రి కాల్చి ,స్వీట్లు తినిపించుకున్నారు. వంగలపూడి అనిత ఇంటి వద్ద నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో డ్యాన్సులు చేశారు. అంతకుముందు ట్రాన్సజెండర్ల బృందం కూటమి తరపున గెలిచిన అనిత కు గుమ్మడికాయలతో దిష్టి తీశారు.హారతులు పట్టారు.
Reporter
Rapid TV