Rapid TV - Andhra Pradesh / Anakapally : కలకత్తాలో జరిగిన దారుణ సంఘటనకు నిరసనగా అనకాపల్లిలో వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి గుడి జంక్షన్ లో శనివారం సాయంత్రం మహిళలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ జంగాల ఫణి మాట్లాడుతూ కలకత్తాలో ఒక ట్రైన్ డాక్టర్ పై జరిగిన హత్యాచారం, హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా సరైన చట్టాలు తీసుకురావాలని అన్నారు. మహిళలను అసభ్యంగా చూడడానికే భయపడే విధంగా చట్టాలను తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ జీ.సువర్ణ, ట్రెజరర్ డి. సునీత, వాసవి క్లబ్ వనిత సభ్యులు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు
Admin
Rapid TV