Rapid TV - Andhra Pradesh / Anakapally : నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దంపతులు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బిజెపి పార్టీ నుంచి పోటీ చేసి అనకాపల్లి ఎంపీగా గెలుపొందిన సందర్భంగా సీఎం రమేష్ ఉత్తరాంధ్ర ఇలవేలుపు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకంబిక అమ్మవారిని బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సీఎం రమేష్ దంపతులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, అచ్యుత దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం సాలువ మరియు జ్ఞాపకతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బండారి ప్రసాద్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV