Rapid TV - Andhra Pradesh / Anakapally : విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక ప్రతిభను ఉపాధ్యాయులు వెలికి తీయాలి - ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి, న్యూస్ : చిన్న వయసు నుండి విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక ప్రతిభను ఉపాధ్యాయులు వెలికి తీయాలని, పోటీ తత్వాన్ని పెంచేందుకు ఈ సైన్సు ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లి వద్దగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల లో ఏర్పాటుచేసిన సైన్స్ కేరును ఎమ్మెల్యే సుందరపు, సబ్ కలెక్టర్ జాహ్నవి ప్రారంభించారు. విశాఖ అనకాపల్లి జిల్లాల నుండి 11 గురుకుల పాఠశాలల విద్యార్థులు బాలురు 4 పాఠశాలల నుండి, బాలికలు 7 పాఠశాలలనుండి 200 మంది విద్యార్థులు, 70 మంది పాఠశాల టీచర్లు పాల్గొని అనేక పరిశోధనలు చేసి తమ ప్రతిభను చాటారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సృజనాత్మకతను పెంచే రకరకాల పరిశోధనలు చేయడం ద్వారా రానున్న రోజుల్లో వీరే సమాజాన్ని మార్చే భావి భారత పౌరులు అవుతారని అన్నారు. పర్యావరణ రహిత గ్రామాలు నిర్మాణం, సోలార్ విద్యుత్తు తయారీ, మంచినీటి శుద్ధి చేసే యంత్రాంగం తదితర ప్రాజెక్టులు వీక్షించి తయారుచేసిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ విద్యతోపాటు ప్రతిభ పాఠాలు నేర్పేందుకు ఈ సైన్స్ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడతాయని పాఠశాల ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాల న్నారు. ప్రిన్సిపల్ మల్ల మాణిక్యం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఐఈఓ సుజాత మాట్లాడుతూ విశాఖ, అనకాపల్లి జిల్లాలో గల అంబేద్కర్ గురుకుల పాఠశాలలనుండి పాల్గొన్న 200 మంది విద్యార్థుల్లో 16 మందిని ఎంపిక చేయడం జరుగుతుందని, వీరిని విశాఖలో జరుగు జోనల్ సైన్స్ స్పేర్ కే పంపించడం జరుగుతుందని, దానిలో ఎంపికైన వారిని పల్నాడు జిల్లాలో జరుగు రాష్ట్ర వ్యాప్త సైన్స్ ఫెయిర్ లో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఒ రూపవతి, డి ఈఓలు అరుణ కుమార్, వెంకటలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేశ్వరి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ, స్థానిక కౌన్సిలర్ మధ్య రామకృష్ణ, జడ్జెస్ కాళిదాసు, రమేష్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు శాంత కుమారి, కొణతాల విశ్వేశ్వరరావు, పాపాజీ, కూటమి నాయకులు బొద్దపు శ్రీను, గొర్లి నానాజీ, ఆడారీ రమన బాబు, వైస్ ఎం పి పి రాజాన శేషు, కోటారు సాంబ, ఆడారి ఆదిమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV