Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : RAIDP. TV సబ్బవరం. వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలమేరకు జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న "వెన్నుపోటు దినోత్సవం" సంబంధించి పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడం కోసం,పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి రెడ్డి అదీప్ రాజ్ గారు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం స్థాయి సమావేశం నిర్వహించి వెన్నుపోటు దినోత్సవానికి వ్యూహాత్మక దిశా నిర్దేశం, పోస్టర్ ఆవిష్కరణ మరియు పార్టీ బలోపేతానికి కార్యాచరణ పలు అంశాలు పై చర్చించారు*. అదీప్ రాజ్ గారు మాట్లాడుతూ ఎన్నికల మందు కూటమినేతలు సూపర్ సిక్స్ పథకాలు హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. తల్లికి వందనం లేదు,అన్నదాత సుఖీభవ అసలే లేదు, సూపర్ సిక్స్ పేరుతో బాబు ప్రజలను మోసం చేశారు. సూపర్ సిక్స్ పధకాల అమలు కోసం ప్రజలకు జరిగిన మోసం పై జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా ఏడాది పాలన పై ఎండగడతామని తెలిపారు. ఈ సమావేశం లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భగవాన్ జయరాం,మాజీ జడ్పీటీసీ జిల్లా అధికార ప్రతినిధి కోటను రాము,,పెందుర్తి జడ్పీటీసీ ఉప్పిలి కనక రాజు,మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు,సబ్బవరం మాజీ సర్పంచ్ ధన్మిరెడ్డి శ్రీనివాస్,88వ వార్డు అధ్యక్షులు గండ్రెడ్డి మహాలక్ష్మి నాయుడు,79వ వార్డు అధ్యక్షులు అప్పికొండ మహాలక్ష్మి నాయుడు,93వ వార్డు అధ్యక్షులు దాసరి సత్తిబాబు,పరవాడ వైస్ ఎంపీపీ బంధం నాగేశ్వరరావు,పరవాడ మండల అధ్యక్షులు కోన రామారావు,రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ రాజ్,అనకాపల్లి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్,లీగల్ సెల్ అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ ,సీనియర్ నాయకులు శాలపు సంతోష్, అప్పలరాజు,వేపాడ శ్రీను తదురులు ఉన్నారు
Reporter
Rapid TV