Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ సబ్బవరం ::: విశాఖ డైరీ పాల సంస్థల వేతన కార్యదర్శుల మరియు సిబ్బంది సమావేశం. . బుధవారం సబ్బవరం లో జరిగింది ఈ సమావేశంలో ప్రెసిడెంట్ పెంటకోట సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ డైరీ లో మొట్టమొదటి నుంచి సిబ్బంది కష్టపడి పావలా పావలా కూడబెట్టి సంస్థకు ముట్ట చెబుతుంటే, సంస్థలో కష్టపడే వారికి సరైన జీతాలు లేకున్నా, కూర్చునే వారికి అధిక జీతాలు ఇస్తూన్నారని ఆరోపించారు. యాజమాన్యం సొమ్ము సుమారుగా ఎనిమిది కోట్లు కాజేసి, వారి సొంత అవసరాలకు ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసం అని పాలకవర్గ సభ్యులు అంటున్నారు. తమకు సరైన వేతనం సమకూర్చకపోతే తగిన మూల్యం సంస్థ చెల్లించుకోవలసి వస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Rapid TV