Rapid TV - Andhra Pradesh / Anakapally : భావవ్యక్తీకరణకు చిత్రలేఖనం దోహదపడుతుంది జిల్లా ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు అనకాపల్లి : భావవ్యక్తీకరణకు చిత్రలేఖనం దోహదపడుతుందని జిల్లా ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు పేర్కొన్నారు. గ్రీన్ క్లబ్ వ్యవస్ధాపకులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ ఆధ్వర్యంలో శ్రీ గౌరీ గ్రంథాలయంలో పర్యావరణ దినోత్సవం సందర్బంగా కిడ్స్, జూనియర్, సీనియర్ విభాగాల్లో బుధవారం జరిగిన చిత్ర లేఖన పోటీల విజేతలకు ఆయన బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుందని దానిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే పిల్లలు ఆ రంగంలో అగ్రస్థాయికి చేరతారని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను చిన్నారులు బొమ్మల ద్వారా చూపించడం అభినందనీయమన్నారు. ఏదైనా విషయం చెబితే అందుకు అనుగుణంగా సృజనాత్మక శక్తితో అద్భుతంగా చిత్రాలు గీయడమే చిత్రలేఖనమన్నారు. రంగుల స్వభావాన్ని బట్టి సందేశాత్మక పెయింటింగులు వేయడాన్ని అలవరచుకోవాలన్నారు. సామాజిక పరిస్థితులను ఆలోచించే గలిగేలా ఆధునిక చిత్రకళలో విద్యార్ధులు రాణించాలన్నారు. కంప్యూటర్ సహాయంతో కూడా విభిన్నమైన పెయింటింగ్ వేయడానికి ప్రయత్నం చేయాలని జిల్లా ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు అన్నారు. గ్రీన్ క్లబ్ వ్యవస్ధాపకులు కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి కర్తవ్యమన్నారు. భవిష్యత్లో జిల్లాలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీ గౌరీ గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, గ్రీన్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు పెంటకోట ఉమామహేశ్వరరావు, క్లబ్ ప్రతినిధులు విశ్రాంత జిల్లా అటవీశాఖాధికారి జానకీరావు, విశ్రాంత అటవీ శాఖ రేంజర్ బి.వినోద్కుమార్, ఆర్.అనిత, నీలవేణి, నగిశెట్టి సత్తిబాబు, బేతాళం శేషసాయి, కె.రాజేష్, కె.గణేష్ పాల్గొన్నారు. అనంతరం శ్రీ గౌరీ గ్రంథాలయం ఆవరణలో మొక్కలు నాటారు.
Admin
Rapid TV