Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని నర్సీపట్నం తహసిల్దార్ ఎల్ రామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు అందించే వినతులను ఒకటికి రెండు సార్లు క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పూర్వాపరాలు తెలుసుకొని ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ముఖ్యంగా భూ సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు . కాగా సోమవారం నాటి కార్యక్రమంలో వచ్చిన 11 ఫిర్యాదులలో దాదాపుగా అన్ని ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV