Rapid TV - Andhra Pradesh / Anakapally : .....హోరెత్తిన భరత్ ఎన్నికల ప్రచారం ..... టిడిపి నుండి వైసీపీలోకి చేరిన 50 కుటుంబాలు .... భరత్ కుమార్ కు అడుగడుగున మహిళలు నీరాజనాలు ....అనకాపల్లి 83 వ వార్డు లో భరత్ కుమార్ విస్తృత ప్రచారం ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటూ జై కొట్టిన జనం అనకాపల్లి ఏప్రిల్ 26:- అనకాపల్లి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కి అనకాపల్లి ప్రజలు సంఘీభావం తెలియజేస్తున్నారు... ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 83 వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి 83 వ వార్డు ఇంచార్జ్ జాజుల రమేష్ నేతృత్వంలో వార్డులో శుక్రవారం ఎన్నికల ప్రచారం ఘనంగా జరిగింది ముందుగా మల్లమ్మ పేరంటాలమ్మను దర్శించుకున్నారు అనంతరం లక్ష్మీదేవి పేట ప్రచారంలో పాల్గొన్నారు.. ప్రచారంలో భాగంగా బుద్ధ వెంకట్రావు ఆధ్వర్యంలో టిడిపి నుండి వైసీపీలోకి 50 కుటుంబాలను భరత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు...రోజు రోజుకు భరత్ వెంట నడిచేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు ప్రచార స్థలానికి చేరుకోగానే మహిళలు, స్థానిక నాయకులు భరత్ కు ఘన స్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా భరత్ గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు గడప గడపలో మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి భరత్ కు హరతులు పట్టారు మార్గ మధ్యలో ప్రజలను పలకరిస్తూ వారి యోగ క్షేమాలని అడిగి తెలుసుకుని తనను దీవించాలని భరత్ విజ్ఞప్తి చేశారు. విద్యావంతుడైన నన్ను దీవించి ఎమ్మెల్యేగా చేస్తే అనకాపల్లి ని అభివృద్ధి చేస్తానని, ప్రజలందరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా పరిష్కారిస్తానని చెప్పారు.తామంతా మీకు సహకరిస్తామంటూ భరత్ కు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా మహిళలకు చేసినంత మేలు మరే ముఖ్యమంత్రి చేయలేదు అన్నారు.ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి, జగన్మోహన్ రెడ్డి ని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని సూచించారు అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి సుస్థిరమవుతుందని ఆయన చెప్పారు. మే 13 న జరగబోయే సార్వాత్రిక ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి గా బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గా మలసాల భరత్ కుమార్ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను కోరారు... ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బీశెట్టి సత్యవతి,అనకాపల్లి అసెంబ్లీ పరిశీలకులు,భీశెట్టి కాశీ విశ్వనాథం, పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, డాక్టర్ విష్ణుమూర్తి,డాక్టర్ రామ్మూర్తి, జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయం డైరెక్టర్ ఏవి రత్నకుమారి, బుద్ధ వెంకటరావు, రాపాక స్వామి, కొమ్మని శంకర్, ఎల్లపు నానాజీ, మొల్లేటి కొండలరావు, పాతాళ శంకర్, పొలిమేర శంకర్, రాయవరపు జోగిరాజు, మేడిశెట్టి గణేష్, పాము సన్నీ బాబు,లకోజు రాంబాబు,మావూరి సాంబశివరావు, కే ఉమా శంకర్,మళ్ళసత్యనారాయణ, కాలివు వరలక్ష్మి, డిసెట్టు నరసింగరావు, మాఊరి శ్రీనివాసరావు, డి బసవరాజు,బీ నాగరాజు, ఎం శివ,ఎం ముసలయ్య, బి శివాజీ,కాళీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....
Admin
Rapid TV