Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి : చోడవరం నియోజకవర్గం రావికమతం మండల కేంద్రం రావికమతంలో శనివారం ఉదయం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ పైలరాజు ఎంపీడీవో వెంకన్న బాబు ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్లు కూడలిలో మానవహారం గా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఎంపీపీ పైలరాజు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతినెల మూడవ శనివారం ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం గురించి తెలియజేసేందుకు ఈ ర్యాలీ మనవహరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అందరూ స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ దిశగా అడుగులు వేయాలని దీని ద్వారా రుగ్మతులు లేని సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు వివిధ శాఖలకు చెందిన అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Rapid TV