Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవి. మాడుగుల నియోజకవర్గం వీరవిల్లి అగ్రహారానికి చెందిన డి.లక్ష్మీ రావు 50 ని ద్వి చక్ర వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెండాడు. మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారానికి చెందిన లక్ష్మీ రావు గురువారం ఉదయం వాకింగ్ కి వెళుతుండగా వడ్డాది సమీపిస్తున్న తరుణంలో మాడుగుల మండలం కేజే పురం గ్రామానికి చెందిన నిత్య సాయి అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెనకనుంచి వచ్చి బలంగా ఢీకొట్టడంతో లక్ష్మీ రావు తారు రోడ్డుపై ముందుకి పడిపోవడంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావంతో అక్కకక్కడే మృతి చెందారు మృతుడికి భార్య యుక్త వయసు ఉన్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సంఘటన వివరాలు తెలుసుకున్న కుటుంబీకులు బోరున వినిపిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Rapid TV