Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ :: రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి అని అనకాపల్లి ఎంపీ సీ.ఎం రమేష్ అన్నారు. అక్టోబర్ 2 తేదీన గాంధీ జయంతి సందర్భంగా వడ్డాది గ్రామంలో అమ్మ హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్ గారి స్వగృహంలో పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ యువతరంలో ప్రతీ ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలన్నారు.సంస్థ సభ్యులు తో వారు గతంలో నిర్వహించిన సేవా కార్యక్రమలు గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఉత్తరాంధ్ర లోనే అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించే వి.వినోద్ బాలు గారిని ప్రత్యేకంగా అభినందించారు ఇప్పటివరకు 999 శిబిరాలు నిర్వహించడం అనేది సాధారణ విషయం కాదు అని వారి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.వడ్డది లో నిర్వహించే రక్తదాన శిబిరంతో వెయ్యి శిబిరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ముందుగా అభినందనలు తెలియజేసి రానున్న రోజుల్లో అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు.కార్యక్రమంలో చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు గారు అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు గారు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు సిరిగిరిశెట్టి శ్రీరామమూర్తి గారు మరియు అమ్మ హెల్పింగ్ హార్ట్స్ సంస్థ టీం సభ్యులు పాల్గొన్నారు.
Admin
Rapid TV