Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి. అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారి కొత్త అమావాస్య జాతర ను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించిన సందర్భంగా జరుగుతున్న అమ్మవారి మహోత్సవాలలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న నెల రోజుల జాతర లో భాగంగా ఏప్రియల్ 13 ఆదివారం సాయంత్రం 5:00 గంటల నుండి "సనాతన క్షాత్రం" అనే ఆధ్యాత్మిక పవచన సమావేశం ప్రముఖ సంఘ సేవకులు కాండ్రేగుల శ్రీరామ్ గారి నిర్వహణ లో జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబందించిన పోస్టర్ ను మాజీ మంత్రివర్యులు,శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారి చేతులు మీదుగా శుక్రవారం పట్టణంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధి గా డా!!ఎల్. వి. గంగాధర శాస్త్రి గారు శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారు శ్రీ ఆమోగ్ దేశ్ పతి గారు శ్రీ మువ్వా శుభ రాజేశ్వరి గారు విచేస్తున్నారు కావున, పుర ప్రజలు అందరు అధికసంఖ్యలో పాల్గొని మన సనాతన ధర్మం యొక్క మూలాల పై జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక సమావేశం లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరిని కోరడమైనది, ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర , దూలం గోపి, చదరం నాగేశ్వరావు, మంగ ఈశ్వర్, గంగుపాం జగదీష్ , కోనా వాసు, గంగాధర్,దొడ్డి రాము తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV