Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, రావికమతం:: మండలంలోని గర్ణికం ఫంక్టన్ హాల్ లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం మండల పార్టీ అధ్యక్షులు రాజన కొండనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి చోడవరం శాసన సభ్యులు కె ఎస్ యన్ ఎస్ రాజు ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి తరపున నన్ను శాసనసభ్యులుగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు 8600 మెజారిటీ రావి కమతం మండలంలో తీసుకువచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు రాజనకొండ నాయుడుకు కార్యకర్తలకు నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు చూశానని పదవీకాలంలో నన్ను కలిసిన వారి కంటే నాకు పదవి లేనప్పుడు కలిసిన వారికి నేనెప్పుడూ అండగా ఉంటానని వారిని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను అని అన్నారు. పార్టీ కోసం పోరాడే కార్యకర్తలకు అండగా ఉంటానని మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తానని మీ గ్రామానికి వచ్చి దళితవాడలో నిద్రిస్తానని తెలిపారు. ఆర్భాటాలు వద్దని కక్ష సాధింపులు అసలే మనకు వద్దని అన్నారు. గ్రామంలో ప్రతి ఇంటి కి వెళ్లి వారి వివరాలను తీసుకుందాం వారి యొక్క సమస్యల్లో మనం పాలుపంచుకొని వాళ్లకి అండగా ఉందామన్నారు. ఏ కార్యక్రమాలు చేసిన ఎన్డీఏ కూటమి మిత్రులను కలుపుకొని వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలకు సూచించారు. భోజనం విరామం అనంతరం రాత్రి ఏ సమయం అయినప్పటికీ కూడా ప్రతి గ్రామంలోని కార్యకర్తలతో మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఈరోజు వెళ్తానని తెలిపారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు పార్టీ నాయకులు గ్రామ పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు
Admin
Rapid TV