Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం డి.ఎస్.పి పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృష్ణదేవిపేటలోని అల్లూరి పార్కు సమీపంలోని చుక్కపణుకు పివిటీజీ గిరిజన గ్రామంలో సోమవారం ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గిరిజనుల వసతులు, ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాలలో భాగమైన త్రాగునీరు తదితర అంశాలను డి.ఎస్.పి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోమియో డాక్టర్ హేమలత సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించి, గ్రామస్తులకు ఉచితంగా మందులు అందించారు. గ్రామస్తుల కోరిక మేరకు ప్రతి కుటుంబానికి గొడుగులు, చీరలు, పంచెలు, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు బానిసలవ్వకుండా క్రీడా నైపుణ్యం, వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని, యువత తమ జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపించుకోవాలని ఆయన సూచించారు. గిరిజనుల కోరిక మేరకు త్వరలో త్రాగునీటి కొరకు వాటర్ ఫిల్టర్ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, కృష్ణదేవి పేట ఎస్ఐ వై తారకేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV