Rapid TV - Andhra Pradesh / Anakapally : పాడేరు ఘాట్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన ఎంపి సీఎం రమేష్ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశం…. పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,పలువురు గాయపడ్డారు. ఎంపి సీఎంరమేష్ అనకాపల్లి పర్యటనలో బాగంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గాజువాక లో ఉన్న ఆర్కే హాస్పటల్ కు స్వయంగా వెళ్లి పరామర్శించారు .మెరుగైన చికిత్స అందించాలని హాస్పటల్ మెడికల్ అధికారులను ఆదేశించారు. ఎంపి సిఎం రమేష్ మాట్లాడుతూ ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతి చెందిన వారికి ప్రగాఢ సంతాపం ,వారి కుటుంబ సభ్యలకు సానుభూతి తెలియజేసారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, బుధవారం పాడేరు లో జరిగిన మోదకొండమ్మ ఉత్సవాలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధి అచ్యుతాపురానికి చెందిన ఎస్ ఎస్ వి సౌండ్సువారు స్టేజ్ లైటింగ్ , సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఉత్సవాల ముగింపు అనంతరం తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులో వీరు ప్రయాణిస్తున్న లారీకి బ్రేక్స్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా తిరగబడటంతో, దానిపై ప్రయాణిస్తున్న అచ్యుతాపురం,యలమంచిలి, చోడవరం ప్రాంతాలకు చెందిన లైటింగ్ ,సౌండ్ సిస్టమ్ ఏర్పటుకోసం పనిచేస్తున్న దినసరి కార్మికులు లోయలోకి పడిపోయి , వారిపై లైటింగ్,డెకరేషన్ సామాన్లు పడిపోవడంతో, ముగ్గురు చనిపోగా, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరమని అన్నారు.బాధిత కుటుంబ సభ్యులకు తగిన ప్రభుత్వ సహాయం అందే విధంగా కృషి చేస్తానని సిఎం రమేష్ హమీ ఇచ్చారు. ఎంపి సీఎం రమేష్ తో తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్ ఉన్నారు
Admin
Rapid TV