Rapid TV - Andhra Pradesh / Anakapally : భారీ వృక్షాన్ని నరికివేతపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు కి ఎమ్మెల్యే ఆదేశాలు యలమంచిలి : పర్యావరణ పరిరక్షణ కోసం ఒకవైపు ప్రభుత్వం మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తుంటే మరో వైపు కొందరు వ్యక్తులు లేఅవుట్ల కోసం భారీ వృక్షాలను నరికేస్తున్నారని ఎమ్మెల్యే సుందర విజయకుమార్ అన్నారు. మంగళవారం అధికారులతో కలిసి భారీ వృక్షాన్ని నరికిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్నంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు కోసం చెట్లను నరకడం అన్యామని ప్రభుత్వాలు ఒక పక్కన పర్యావరణం రక్షణ కోసం మొక్కలు నాటాలని పిలుపునిస్తుంటే మరోవైపు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వీరిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నానని తెలిపారు.
Reporter
Rapid TV