Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా: అచ్చుతాపురం మండలంలో ఎస్ కే ఆర్ ఫంక్షన్ హాల్లో .. ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు,జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ లాలం భవాని భాస్కర్,బీజేపీ నాయుడు నాలుగు మండలాలు ఎన్డీఏ ముఖ్య నాయకులు సమావేశం .... ...ఎలమంచిలి జనసేన కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ సమావేశంలో మాట్లాడుతూ ఎలమంచిలి నియోజవర్గం ప్రజలు కోసం అభివృద్ధి కోసం, కష్టపడ్డామన్నారు. కూటమి ప్రజలు అండగా ఉండ బట్టే విజయం సులభం అయ్యిందని సుందరపు ఆనందం వ్యక్తం చేశారు. ఫస్టు టైమ్ ఓటర్లు బాధ్యత వహించారన్నారు. మార్పు సంకేతం ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. లెక్కలు తారుమారు చేసి విజయం కొత్త తరహా పరిపాలన చూస్తారన్నారు. సైకోతో ప్రజలే యుద్ధం చేసి మూడూ పార్టీలు ఐకమత్యంగా పని చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రాజాన రమేష్ కుమార్, బైలపూడి రామదాసు, లాలం చందు, రంగనాయకులు, జనపరెడ్డి శ్రీనివాసరావు, జనపరెడ్డి నర్సింగరావు, డిఎన్ఎస్ రాజు, (బుజ్జి) దిన్ బాబు, కొరుపోలు చిన్నారు, ద్వారపురెడ్డి బాబి జనసేన టిడిపి బిజెపి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV