Monday, 14 September 2026 09:31:02 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

రూ. 2 లక్షలు విలువచేసే గంజాయి పట్టుకున్న నాతవరం పోలీసులు : నలుగురి అరెస్టు.

Date : 14 October 2025 08:23 PM Views : 440

Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : ఉన్నతాధికారుల ఆదేశాలపై గంజాయి, తదితర మత్తుపదార్థాల రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పలుచోట్ల గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. తాజాగా మంగళవారం రూరల్ పోలీసు సర్కిల్ పరిధిలోని నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మరియు లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 2 లక్షలు విలువచేసే 5 కేజీల ఎండు గంజాయి మరియు 1 కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నర్సీపట్నం డి.ఎస్.పి పి శ్రీనివాసరావు, రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ సూచనలతో నాతవరం ఎస్సై వై తారకేశ్వరరావు తన సిబ్బందితో మండలంలోని చమ్మచింత జంక్షన్ లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమయంలో రెండు బైకులపై వస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులను గమనించి వెనుకకు తిరిగి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. పోలీసులు ఆప్రమత్తంగా వ్యవహరించి పారిపోతున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని ప్రశ్నించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు. ఈ సంఘటనలో అల్లూరి సీతారామరాజు జిల్లా వంతల గుమ్మి గ్రామానికి చెందిన వంతల బుజ్జిబాబు (33), వంతల ఈశ్వర్ (19), నల్గొండ జిల్లాకు చెందిన కూతాటి శివకుమార్ (23), మహమ్మద్ ఫుర్ఖాన్ (20) లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 5 కిలోల ఎండు గంజాయి, 1కిలో లిక్విడ్ గంజాయి, రెండు మోటారు సైకిళ్ళు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. ఈ సమావేశంలో నాతవరం ఎస్సై వై తారకేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :