Wednesday, 10 December 2025 07:30:02 PM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

రూ. 2 లక్షలు విలువచేసే గంజాయి పట్టుకున్న నాతవరం పోలీసులు : నలుగురి అరెస్టు.

Date : 14 October 2025 08:23 PM Views : 188

Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : ఉన్నతాధికారుల ఆదేశాలపై గంజాయి, తదితర మత్తుపదార్థాల రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పలుచోట్ల గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. తాజాగా మంగళవారం రూరల్ పోలీసు సర్కిల్ పరిధిలోని నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మరియు లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 2 లక్షలు విలువచేసే 5 కేజీల ఎండు గంజాయి మరియు 1 కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నర్సీపట్నం డి.ఎస్.పి పి శ్రీనివాసరావు, రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ సూచనలతో నాతవరం ఎస్సై వై తారకేశ్వరరావు తన సిబ్బందితో మండలంలోని చమ్మచింత జంక్షన్ లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమయంలో రెండు బైకులపై వస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులను గమనించి వెనుకకు తిరిగి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. పోలీసులు ఆప్రమత్తంగా వ్యవహరించి పారిపోతున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని ప్రశ్నించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు. ఈ సంఘటనలో అల్లూరి సీతారామరాజు జిల్లా వంతల గుమ్మి గ్రామానికి చెందిన వంతల బుజ్జిబాబు (33), వంతల ఈశ్వర్ (19), నల్గొండ జిల్లాకు చెందిన కూతాటి శివకుమార్ (23), మహమ్మద్ ఫుర్ఖాన్ (20) లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 5 కిలోల ఎండు గంజాయి, 1కిలో లిక్విడ్ గంజాయి, రెండు మోటారు సైకిళ్ళు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. ఈ సమావేశంలో నాతవరం ఎస్సై వై తారకేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2025. All right Reserved.



Developed By :