Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల ప్రక్రియ ఈరోజు ప్రారంభమయ్యాయి. మండలంలోని వివిధ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఓటర్ లిస్ట్ లను పంచాయతీ కేంద్రాల వద్ద నోటీస్ బోర్డ్ లో ఉంచారు. ఎన్నికల నిమావళి ఓటర్ల జాబితా అభ్యంతరాలు నమోదు తదితర అంశాలను గూర్చి నోటీస్ బోర్డులో తెలిపారు. మండలంలోని కొత్తకోట సచివాలయంలో పెంటపాటి సూర్యారావు మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుసుమంచి నాగేశ్వరరావు కొత్తకోట సచివాలయ నోటీసు బోర్డులో జాబితాను ప్రదర్శించారు. ఆయనతోపాటుగా జి పరశురాముడు జీకే దొర తదితర సిబ్బంది పాల్గొన్నారు
Admin
Rapid TV