Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం ప్రతిష్టా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జూలై 20వ తేదీ ఆషాడ పౌర్ణమి సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగనున్నాయని ప్రతిష్టా శతజయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంధి శేషు కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. శనివారం ఉదయం ఐదున్నర గంటల నుండి నగర సంకీర్తనతో అమ్మవారికి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అన్నారు. ఉదయం7 గంటలకు గోపూజ, 7: 30 గంటలకు కన్య అర్చన, 49 కలశములతో స్నపనము, అమ్మవారికి అభిషేకము, 9.30 గంటలకు కన్య మూలమంత్ర హోమములు కసింకోట వాస్తవ్యులు, ఆగమ పండిత్, అర్చక ఎగ్జామినర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత శ్రీమాన్ శ్రీ రేజేటి రామాచార్యులు వారి ఆధ్వర్యంలో జరుగునని తెలియజేశారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి 6 గంటల వరకు నారాయణీయం అంత్యాక్షరిలో గిన్నిస్ బుక్ ఆఫ్ అవార్డు గ్రహీత కాకినాడ వాస్తవ్యులు శ్రీమతి గ్రంధి తాయారు గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం చే "నారాయణీయము" పారాయణ జరగనుందని తెలియజేశారు. అనంతరం ఆమెచే నారాయణీయం గ్రంథం విశిష్టత వివరించబడునని అన్నారు. కన్య అర్చనలో, కన్య మూల మంత్ర హోమంలో పాల్గొనేవారు డాక్టర్ జి. శేషు కుమార్ 9848313203, జీ వి వి ఎస్ మాణిక్యం 9848212531, ఉప్పల శ్రీనివాసరావు 9849836936 వారిని సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిల్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV