Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండల కేంద్రంలో తల్లిపాల వారో త్సవాలు సందర్భంగా రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల యొక్క ఆవశ్యకతను తెలియజేశారు తల్లిపాలు బిడ్డలకు ఇవ్వడం వలన వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉంటారని ఎటువంటి రుగ్మతలు దరిచేరకుండా ఉంటాయన్నారు. తల్లిపాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయని మందులు ఆసుపత్రులు పని లేకుండా బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు దోహత పడుతుందని తెలిపారు. ఈరోజు నుంచి వారం రోజులు పాటు వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Rapid TV