Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండల కేంద్రంలో మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి చోడవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలు పారదర్శకమైనవని వివక్షత లేకుండా లంచాలు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందజేసేటువంటి పథకాలు ఉన్నాయన్నారు. కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టిగా మేము సిద్ధం మా బూతు సిద్ధం అంటూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాను సరి చూసుకోవాలని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి దొండా రాంబాబు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు కన్వీనర్లు గృహ సారథులు తదితరులు హాజరయ్యారు
Admin
Rapid TV