Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఆందోళన -సిఐటియు మద్దతు వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సి హెచ్ ఓ)ల సమస్యలు పరిష్కారానికి మంగళవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఆరు సంవత్సరాలు దాటిన ప్రతి సిహెచ్ఓ లను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్ హెచ్ ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్, పని ఆధారత ప్రోత్సాహకాలు, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓల ని మినహాయించాలని తదితరు డిమాండ్లపై ఈ ఆందోళన నిర్వహించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28వ తేదీ నుంచి సమ్మె నిర్వహిస్తున్న సిహెచ్ ఓ లు ఈరోజు అనకాపల్లిలో ఈ ఆందోళన నిర్వహించడం జరిగింది. జిల్లాలోని 45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిహెచ్వోలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కోశాధికారి, ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వి.వి. శ్రీనివాసరావు సంపూర్ణ మద్దతును తెలియజేసి సిహెచ్ ఓ ల న్యాయమైన సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ప్రభుత్వాలు తక్షణమే డిమాండ్లు పరిష్కారానికి చర్చలు జరిపి ప్రజా సేవలు పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం డిఆర్ఓ వెంకట రమణ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ ఓ లు జి భవాని, పి రేవతి, జి యమునా, కె అశ్విని, టి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV