Rapid TV - Andhra Pradesh / Anakapally : స్థానిక వుడ్ పేట హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో , కరస్పాండెంట్ శేశెట్టి గిరీష్ కుమార్ పర్యవేక్షణలో, ప్రపంచం ఎదురుచూస్తున్న చారిత్రిక ఘట్టం అయోధ్య నూతన శ్రీరామ మందిరంలో బాల శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగు అపురూప క్షణమున దేశం యావత్తు ఏకస్తులమై జగదానందకారకుడు, జానకి నాయకుడు అయినా శ్రీరాముడిని కీర్తిస్తూ జ్యోతి ప్రజ్వలన చేయవలసినదని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పిలుపుమేరకు చిట్టి పొట్టి చిన్నారులంతా సీత రామ పరివార వేషధారణలు ధరించి, హనుమ జెండాలను చేతబట్టి భక్తిశ్రద్ధలతో శ్రీరామచంద్రుడు ను పరిపరి విధములుగా కీర్తిస్తూ, కోలాటాలు ,నృత్యాలు చేస్తూ కవాతు నిర్వహించి చూపరులను విశేషంగా ఆకర్షించారు.కరస్పాండెంట్ శేశెట్టి గిరీష్ కుమార్ చిట్టి పొట్టి చిన్నారులకు శ్రీరాముడి గాధను విపులంగా వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత సిబ్బంది స్థానికులు విశ్రాంత ఏఈ మల్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV