Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయని కారణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4న శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ తెలిపారు. ఈ మేరకు శనివారం నర్సీపట్నం డి.ఎస్.పి ని కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా తాత్సారం చేస్తూ ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి జూన్ 4వ తేదీకి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆరోజు ప్రభుత్వ విధానాలకు నిరసనగా శాంతియుత నిరసన ర్యాలీ చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు.
Reporter
Rapid TV