Tuesday, 07 April 2026 02:45:26 PM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

యలమంచిలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇతర నాయకులు తో బొత్స సత్యనారాయణ సమావేశం

Date : 09 August 2024 06:01 PM Views : 221

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా, యలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పిటిసి, కౌన్సిలర్లు తో బొత్స సత్యనారాయణ సమావేశం. సమావేశానికి హాజరైన కురసాల కన్నబాబు, ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం వైసిపి స్థానిక సంస్థలలో 600 మంది ఓటర్లు ఉన్నారని, కూటమి ప్రభుత్వానికి కేవలం 200 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. తక్కువ అభ్యర్థులు కలిగిన కూటమి కి ఏ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తుందని ప్రశ్నించారు. వైసిపి పక్షాన ఉన్న ఓటర్లను పెట్టే యోచన తోనే పోటీలోకి దిగుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో మనమందరం ఒకే మాటమీద ఉండాలని, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇద్దామని అన్నారు. అనంతరం విజయవాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శిలాఫలకాన్ని తొలగించడం అన్యాయమని, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ అంబేద్కర్ వనంలో నిన్న రాత్రి లైట్ లేపి శిలాఫలకం తొలగించడం అన్యాయమని అన్నారు. దళితులకు బడుగు బలహీన వర్గాలకు ఆదర్శంగా నిలిచే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాలను చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తొలగించడం అన్యాయమని తెలిపారు. కురసాల కన్నబాబు మాట్లాడుతూ నిన్న రాత్రి జరిగిన కుట్ర యావత్ భారతావని ఖండించాలని, విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకం తొలగించడం జాతి యావత్తు ఖండించాలని అన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :