Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా, యలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పిటిసి, కౌన్సిలర్లు తో బొత్స సత్యనారాయణ సమావేశం. సమావేశానికి హాజరైన కురసాల కన్నబాబు, ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం వైసిపి స్థానిక సంస్థలలో 600 మంది ఓటర్లు ఉన్నారని, కూటమి ప్రభుత్వానికి కేవలం 200 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. తక్కువ అభ్యర్థులు కలిగిన కూటమి కి ఏ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తుందని ప్రశ్నించారు. వైసిపి పక్షాన ఉన్న ఓటర్లను పెట్టే యోచన తోనే పోటీలోకి దిగుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో మనమందరం ఒకే మాటమీద ఉండాలని, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇద్దామని అన్నారు. అనంతరం విజయవాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శిలాఫలకాన్ని తొలగించడం అన్యాయమని, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ అంబేద్కర్ వనంలో నిన్న రాత్రి లైట్ లేపి శిలాఫలకం తొలగించడం అన్యాయమని అన్నారు. దళితులకు బడుగు బలహీన వర్గాలకు ఆదర్శంగా నిలిచే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాలను చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తొలగించడం అన్యాయమని తెలిపారు. కురసాల కన్నబాబు మాట్లాడుతూ నిన్న రాత్రి జరిగిన కుట్ర యావత్ భారతావని ఖండించాలని, విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకం తొలగించడం జాతి యావత్తు ఖండించాలని అన్నారు.
Reporter
Rapid TV