Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : ఉపాధి కూలీల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించండి సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ ఉపాధి కూలీల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ బి పోతురాజు గౌరవ అధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి కూలీల వేతనాలు141 కోట్లు వరకు ఉందని తక్షణమే వాటిని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కూలి పనిచేసి తొమ్మిది వారాలు గడిచిన వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమని వారు అన్నారు. జిల్లాలో నాలుగు లక్షల 59 వేల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారని, సకాలంలో కూలి డబ్బులు చెల్లించకపోతే ఎలా బ్రతుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులను విడుదల చేసి, కూలీలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఉపాధి కూలీలు బకాయి పడ్డ నగదు చెల్లించకపోతే పెద్ద ఎత్తున కూలీలతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు తాముల జోషి, కొర్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV