Rapid TV - Andhra Pradesh / Anakapally : పాయకరావుపేట రాపిడ్ టీవీ:: ఎస్.రాయవరం : ద్వి చక్ర వాహనాలు నడిపేవారు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సింహాచలం దేవా స్థానం కి ఆదాయపు పన్ను మరియు ఎం.హెచ్.ఏ డిపార్ట్మెంట్ ప్రతినిధి బత్తిన మహేష్ తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని నైట్ హేక్ రైడింగ్ క్లబ్ ఆర్గనైజర్స్ నిఖిల్ ,హేమంత్ ఆధ్వర్యంలో అడ్డురోడ్డు నుండి వైజాగ్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు నివారించుటకు గాను అడ్డురోడ్డు నుండి వైజాగ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆర్గనైజర్ నిఖిల్ మాట్లాడుతూ నైట్ హేక్ రైడింగ్ క్లబ్ ప్రారంభించి సంవత్సరం అయినందున ఈరోజు బైక్ రైడర్స్ కు మరింత అవగాహన పెంచేందుకు వైజాగ్ వరకు ప్రయాణం సాగిస్తున్నామని అలాగే రైడర్ ఆర్గనైజర్ హేమంత్, కోఆర్డినేజర్ ఉదయ్ భరత్ లకు మాకు సహకరించిన స్పాన్సర్లకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బత్తిన మహేష్ ,సీనియర్ జర్నలిస్ట్ బి.వి.వి.సత్యనారాయణ లకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.ఆప్పన్న కు ,ఎస్.ఐ విభూషణ రావు లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని పేర్కొన్నారు. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు అని తెలియజేస్తున్నాము.
Reporter
Rapid TV