Rapid TV - Andhra Pradesh / Anakapally : *ఎస్.రాయవరం : అయోధ్య లో రామ మందిరం అత్యంత సుందరంగా సిద్ధమైందని పాయకరావుపేట నియోజకవర్గ బి.జే.పి శ్రేణులు తెలిపారు.ఆదివారం సాయంత్రం అడ్డురోడ్డు జంక్షన్ లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద బి.జే.పి సీనియర్ నాయకులు పాకలపాటి రవి రాజు ,సేనాపతి సూర్యారావు లు సోమవారం అయోధ్య లోజరగనున్న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు.అయోధ్య లో ప్రారంభమయ్యే కార్యక్రమం 150 దేశాల నుండి ప్రత్యేక విమానాల్లో హాజరవుతున్నారంటే అయోధ్య లో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రపంచంలో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. అయోధ్య లో పాల్గొనే అతిరథమహారధుల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పండుగ వాతావరణం ను అన్ని గ్రామాల్లో ,మండలాల్లో నూ జరిపేలా చూస్తున్న రామాంజనేయ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట అధిక సంఖ్యలో బి.జే.పి నాయకులు ,కార్యకర్తలతో పాటు భక్తులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV