Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : .నాడు-నేడు పనుల్లో జరిగిన అవినీతి పైనా, నాసిరకం పనులు పైనా, ప్రభుత్వం విచారణ చేపడతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గత వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నాడు నేడు కి వేల కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు. అయితే 2019 టిడిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి, 38,98,000 మంది ప్రభుత్వ బడుల్లో చుదువుకుంటుంటే, నేడు 2024లో 38,26,000 మందికి ఆ సంఖ్య పడిపోయింది. 72,000 మంది ప్రభుత్వ బడుల నుంచి వెళ్ళిపోయారు. ఇంత ఖర్చు చేసి వీళ్ళు సాధించింది ఏంటి ? అంటే ఇందులో లోపాలు ఉన్నాయి, అవినీతి ఉంది. అన్నీ మేము సరి చేస్తాం.
పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థని కూడా గత ప్రభుత్వం నాశనం చేసింది. 2014-19 మధ్య పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల శాతం 80% ఉండేది. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో, పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల శాతం 59% కి పడిపోయింది...
Reporter
Rapid TV