Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : ఈనెల మూడు నాలుగు తేదీలలో కేరళలోని ఎర్నాకుళం లో జరిగిన 4వ జాతీయ పాన్ ఇండియా మాస్టర్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతం కొత్తకోటకు చెందిన పీవీఎం నాగజ్యోతి 4బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ పోటీలలో 300 మంది క్రీడాకారులు పాల్గొనగా, మహిళల విభాగంలో పాల్గొన్న నాగజ్యోతి బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, పవర్ లిఫ్టింగ్, ఓవరాల్ ఛాంపియన్షిప్ లలో 4 బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఎర్నాకుళం లో జరిగిన కార్యక్రమంలో పాన్ ఇండియా మాస్టర్స్ సంస్థ అధ్యక్షులు దీపుదేవ్,, మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ వి ఎన్ షాజీ నాగజ్యోతికి బంగారు పతకాలు, ధ్రువ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ, దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని ఆమె తెలిపారు. కాగా ప్రస్తుతం ఈమె రోలుగుంట జడ్పీ హైస్కూల్ లో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.
Reporter
Rapid TV