Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : గన్నెలలో తల్లిపాల వారోత్సవాలపై అవగాహన ర్యాలీ తల్లిపాలు బిడ్డకు దివ్య ఔషధం అరకులోయ మండలంలోని గన్నెల ఆస్పత్రి ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నెల పి.హెచ్.సి వైద్యురాలు కమల కుమారి మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని, ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలని సూచించారు.. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లి ముర్రుపాలు పట్టించడం కీలకమని, తల్లి పాలు బిడ్డకు దివ్య ఔషధమని లేకుంటే అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు.ఈనెల 8 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం సిడిపిఓ శారద మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి కేంద్రం పరిధిలో తల్లిపాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మూర్తి, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు.
Reporter
Rapid TV