Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ :: అసెంబ్లీ లో గళం వినిపించిన కొణతాల రామకృష్ణ అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు GVMC లో విలీనం అయినప్పటికీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం అసెంబ్లీలో ఆయన ఈ విషయమై ప్రస్తావించారు ఈ రెండు ప్రాంతాల్లో కనీసం అభివృద్ధిని జీవీఎంసీ పట్టించుకోవడంలేదని అన్నారు, అసలు ఈ రెండు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులే మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధిలో నిర్లక్ష్యం కనబడుతుందని , కనీస అవసరాలైన డ్రైనేజీ వంటివి కూడా లేకుండా పోయాయని, విశాఖపట్నం నగరంలో మాదిరిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రావాలని కోరారు ఇప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థ కొనసాగితే ఎక్కడికక్కడ కనెక్టివిటీ లేక డ్రైనేజీలు పారకపోవడం మూలాన దోమల బెడద కూడా ఎక్కువ అవుతుందని తద్వారా వ్యాధులు కూడా ప్రభలే అవకాశం ఎక్కువ ఉందని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో విశాఖపట్నం అనకాపల్లి అలాగే భీమిలి ఈ మూడు ప్రాంతాల్ని కూడా కనెక్ట్ చేస్తూ నిర్మాణం చేయాల్సిన మెట్రో ప్రాజెక్ట్ ని ఏ విధంగా పక్కన పెట్టారో అన్న అంశాలను కూడా సభ దృష్టికి తీసుకువస్తూ త్వరితగతిన వీటిని పూర్తి చేసేందుకు ఒక యాక్షన్ ప్లాన్ ని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు . మున్సిపల్ డంపింగ్ యార్డ్ అంశాన్ని కూడా లేవనెత్తారు, దేశంలోనే ఎక్కడా కూడా నగరం నడిబొడ్డున మున్సిపల్ ఆఫీసులో డంపింగ్ యార్డ్ అనేది నిర్వహణ ఉండదని ఒక్క అనకాపల్లి లోనే ఇలా ఉందని, వెంటనే దీన్ని తరలించేందుకు చర్యలు చేపట్టి అనకాపల్లి ప్రజలకు మేలు చేయాలని కోరారు
Admin
Rapid TV