Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా : రాంబిల్లి మండలం పెద్దకలవాలపల్లి NAOB సమస్యల పరిష్కారం కోసం 314వ రోజు NAOB నిర్వాసితులు శనివారం ఉదయం10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలవరకు సుమారు 4 గంటల వరకు రోడ్లు పైకి వచ్చి నిరసన కొనసాగించరు ex mptc రావి దేముల్లు మాట్లాడుతూ 314 రోజులు గా కలవాలపల్లి పేద ప్రజల ఆర్తనాదాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధికార్లకు వినిపించలేదా మా గ్రామము చుట్టూ ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు కట్టలనుకొన్నపుడు గ్రామ సభ గానీ పబ్లిక్ యియర్ గానీ కనీసం పంచాయతీ తీర్మానం లేకుండా ఎలా నిర్మాణాలు చేపడతారని అధికార్లను నిలదీశారు. ఇప్పటికయినా అధికార్లు చేసి తమ తప్పులను సరిసేసుకొని మా గ్రామానికి జరుగు నష్టాన్ని పూరించే విధముగా ప్రభుత్వ పెద్దలకు తెలియజేసి మా పేద ప్రజలకు న్యాయం చెయ్యాలి అని కోరారు ఈ నిరసన కార్యక్రమములో కలవలపల్లి రాము,అప్పికొండ అప్పారావు,బోదుపు పెదభుల్లు, పారిపల్లి కాంతం, జాగరపు అప్పలనరస, మరిశెట్టి నాగరత్నం,యలమంచిలి చిన సన్యాసమ్మ,పెద్ద ఎత్తున NAOB భాదితులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV