Rapid TV - Andhra Pradesh / Anakapally : సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్, సయ్యద్ సలీమ్ గారికి సత్కారం. ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి సబ్ ట్రజరీ సీనియర్ అకౌంటెంట్ సయ్యద్ సలీమ్ గారు అనకాపల్లి జిల్లా కలెక్టరువారి సువర్ణ హస్తాలమీదుగా జిల్లా స్థాయి మెరిటోరియస్ పురస్కారం అందుకున్న సందర్భంగా అనకాపల్లి సబ్ ట్రజరీ (పశ్చిమం) ప్రాంగణంలో సయ్యద్ సలీమ్ గారిని అభినందిస్తూ, కళాశాలల విశ్రాంత అధ్యాపక సంఘం అనకాపల్లి వారు ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్ర మానికి విశ్రాంత కళాశాలలసంఘం, అనకాపల్లి అధ్యక్షుడు డాక్టర్ రామ సత్యనారాయణ, అధ్యక్షత వహించి, సలీమ్ గారు పెన్షనర్లకు అందించే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యక్షుడు సాయిబాబా, కార్యదర్శి డాక్టర్ ఈశ్వర రావు, ట్రజరర్ రాజారావు, సభ్యులు డాక్టర్ చక్రపాణి, డాక్టర్ మారేశ్వర రావు, డాక్టర్ అశోక్ కుమార్.డాక్టర్ వాసుదేవ రావు, మురళీకృష్ణ, రాము నాయుడు, నరసింహారావు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. సన్మాన గ్రహీత సయ్యద్ సలీమ్ మాట్లా డుతూ, తాను తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిం చానని, తనకు ఈ పురస్కా లభించడం ఆనందదాయ కమని, దీనివలన పెన్షనర్ల పట్ల తన బాధ్యత మరింత పెరిగిందని, ఈ పురస్కారం లభించడానికి తమ జిల్లా ట్రజరీ అధికారిణి శ్రీమతి వి. లక్ష్మీ సుభాషిణి గారికి తన పట్ల వున్న విశ్వాసము, సహృదయతయే కారణ మని , తన పై అధికారిణికి తన పట్లచూపిన సహృద యతను ప్రశంసిస్తూ, తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్టేట్ స్కేల్స్ పెన్షనర్ల సంఘం అధ్యక్ష. కార్యదర్శి, ట్రజరర్ లు జగన్నాథరావు, శర్మ గార్లతో పాటుగా మరియు సభ్యులు శేషగిరిరావు, గాంధి, సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV