Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎస్.రాయవరం : మండలంలోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నక్కపల్లి సర్కిల్ కార్యాలయం అడ్డురోడ్డు పోలీస్ స్టేషన్ వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.అప్పన్న ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల చే జనగణమన గీతం అలపించారు.అంతకుముందు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న మాట్లాడుతూ మా కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరణ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.అలాగే పోలీస్ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేసే ఉద్యోగం అని తన సిబ్బందికి తెలియజేసారు.అలాగే శాంతి భద్రత లను కాపాడే బాధ్యత మనపై ఉందన్నారు. దేశం పట్ల ప్రజల పట్ల బాధ్యత గా వ్యవహరించే వారినే పోలీస్ గా గుర్తిచి ఆ భగవంతుడు కూడా ఈ వ్యక్తులు పోలీస్ గాఉండాలని నిర్ణయిస్తాడన్నారు. అలాంటి అవకాశం వచ్చిన మనం ఆ బాధ్యత ను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఖాకి బట్టలు వేసుకున్న ప్రతీ ఒక్కరూ తమ వృత్తి పట్ల బాధ్యత గా వ్యవహరించాలని కోరారు. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్.ఐ రామకృష్ణ ఉన్నారు.అలాగే మండల కేంద్రం ఎస్.రాయవరం లో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను తహశీల్దార్ విజయకుమార్ ఆవిష్కరించారు. ఆయనతో పాటు డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ,ఆర్.ఐ లు వినయ్ ,మణికంఠ లతోపాటు సర్వేయర్ మూర్తి ,వి.ఆర్.ఓ లు రెవిన్యూ సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV