Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి శంకరం గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు నాలుగేళ్లు బాలుడు మృతి చెందారు. బిక్కవోలుకు చెందిన వీరంతా శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణ స్వామినీ దర్శనం చేసుకొని కారులో తిరిగి వస్తుండగా అనకాపల్లి శంకవరం వద్ద కారు టైర్ పంచరయ్యి డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనకాపల్లి డిఎస్పి సుబ్బరాజు ఘటన స్థలానికి చేరుకొని మృతులను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ తరలించారు.
Admin
Rapid TV